దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. ఎన్నికేసులంటే

India Covid-19 Update on December 23rd.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విస్త‌రిస్తోంది. ఒమిక్రాన్‌ పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2021 5:56 AM GMT
దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. ఎన్నికేసులంటే

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విస్త‌రిస్తోంది. ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 236కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ గురువారం వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌లో 65, ఢిల్లీలో 64, తెలంగాణ‌లో 24, రాజ‌స్థాన్‌లో 21, క‌ర్ణాట‌క‌లో 19, కేర‌ళ‌లో 15, గుజ‌రాత్‌లో 14, జమ్ము క‌శ్మీర్‌లో 3, ఏపీలో 2, ఒడిశాలో 2, యూపీలో 2, ఛండీగఢ్‌, లద్దాఖ్‌, తమిళనాడు, ఉత్త‌రాఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో 104 మంది కోలుకున్నారు.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 12,05,775 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 7,495 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,65,976కి చేరింది. నిన్న ఒక్క రోజే 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,78,759కి చేరింది.

నిన్న6,960 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,42,08,926కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 78,291 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.40 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న 70 ల‌క్ష‌ల మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,39,69,76,774 పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 66.86 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

Next Story