భారత్‌లో కొన‌సాగుతున్న క‌రోనా విజృంభ‌ణ‌

India Covid-19 bulletin on September 4th.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2021 4:45 AM GMT
భారత్‌లో కొన‌సాగుతున్న క‌రోనా విజృంభ‌ణ‌

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 17,04,970 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 42,618 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,29,45,907కి చేరింది. నిన్న ఒక్క రోజే 330 మంది మృతి చెందారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,40,225కి చేరింది.

24 గంట‌ల వ్య‌వ‌ధిలో 36,385 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,21,00,001కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 4,05,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.43శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.63శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.50 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 58,85,687 ల‌క్ష‌ల‌ మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 67,72,11,205 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story