భారత్ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
India Covid-19 bulletin on September 26th.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,88,945 కరోనా
By తోట వంశీ కుమార్ Published on
26 Sep 2021 5:37 AM GMT

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,88,945 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 28,326 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,36,52,745 చేరింది. నిన్న ఒక్క రోజే 260 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,46,918కి చేరింది.
నిన్న 26,032 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,29,02,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,03,476 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.77శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.98శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.90 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 68,42,786 మందికి మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు 85,60,81,527 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.
Next Story