భారత్ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
India covid 19 bulletin on September 17th.దేశంలో కరోనా మహ్మమారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో
By తోట వంశీ కుమార్ Published on
17 Sep 2021 5:31 AM GMT

దేశంలో కరోనా మహ్మమారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 34,403 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,33,81,728కి చేరింది. నిన్న ఒక్క రోజే 320 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,44,248కి చేరింది.
నిన్న 37,950 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,25,98,424కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,39,056 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.65శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.97 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.25 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 64,51,423 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 77.24 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story