భారత్ కరోనా అప్డేట్.. భారీగా తగ్గిన కేసులు
India Covid-19 bulletin on October 5thభారత్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 11,41,642
By తోట వంశీ కుమార్ Published on
5 Oct 2021 4:52 AM GMT

భారత్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 11,41,642 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 18,346 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,853,048 చేరింది. నిన్న ఒక్క రోజే 149 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,49,260కి చేరింది.
నిన్న 29,639 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,31,50,886 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,52,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 201 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 97.93 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 72.51లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 91.54 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.
Next Story