భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

India covid-19 bulletin on October 20th.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 13,23,702 మంది క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Oct 2021 4:55 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 13,23,702 మంది క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 14,623 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,41,08,996కి చేరింది. నిన్న ఒక్క రోజే 197 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 4,52,651 కి చేరింది. నిన్న 19,446 మంది కోలుకున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,34,78,247 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,78,098 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 229 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 98.15 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 41,36,142 మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 99,12,82,283 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.

Next Story