అదుపులోకి వస్తున్న కరోనా.. కొత్తగా ఎన్నికేసులంటే
India Covid-19 Bulletin on October 19th.దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో 11,81,314 మంది
By తోట వంశీ కుమార్ Published on
19 Oct 2021 5:07 AM GMT

దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో 11,81,314 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 13,058 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారిగా నమోదు అవుతున్న కేసుల సంఖ్యలో గత 231 రోజుల్లో ఇదే అత్యల్పం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,40,94,373కి చేరింది. నిన్న ఒక్క రోజే 164 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,52,454 కి చేరింది. నిన్న 19,470 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,34,58,801కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,83,118 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 227 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 98.14 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 87,41,160 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 98,67,69,411 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.
Next Story