త‌గ్గిన‌ కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

India Corona update on December 21st.భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 10,14,079 క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 4:48 AM GMT
త‌గ్గిన‌ కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 10,14,079 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 5,326 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,52,164కి చేరింది. నిన్న ఒక్క రోజే 453 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,78,007కి చేరింది.

నిన్న8,043 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,41,95,060కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 79,097 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.40 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న 64ల‌క్ష‌ల మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,38,34,78,181 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 66.51 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

Next Story