భారత్ కరోనా అప్డేట్.. స్వల్పంగా పెరిగిన కేసులు
India Corona bulletin on September 8th.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల
By తోట వంశీ కుమార్ Published on 8 Sep 2021 5:06 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 17,53,745 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 37,875 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,30,96,718కి చేరింది. నిన్న ఒక్క రోజే 369 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,41,411కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) September 8, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/Vr7WtJNmkH pic.twitter.com/omsL8TyLKb
24 గంటల వ్యవధిలో 39,114 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,22,64,051కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,91,256 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.48శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.49శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.16 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 78,47,625 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 70,75,43,018 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.