కరోనా ఉధృతి.. భారీగా పెరిగిన కేసుల సంఖ్య‌

India corona Bulletin on September 2nd.భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 4:57 AM GMT
కరోనా ఉధృతి.. భారీగా పెరిగిన కేసుల సంఖ్య‌

భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కొత్త‌గా న‌మోదు అవుతున్న కేసుల్లో 70 శాతం ఒక్క కేర‌ళ రాష్ట్రంలోనే న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 16,84,441 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 47,092 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,28,57,937కి చేరింది. నిన్న ఒక్క రోజే 509 మంది మృతి చెందారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,39,529కి చేరింది.

24 గంట‌ల వ్య‌వ‌ధిలో 35,181 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,20,28,825కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 3,89,583 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.48శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.62శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.80 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 88లక్ష‌ల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 66,30,37,334 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story