భారత్ కరోనా అప్డేట్.. స్వల్పంగా తగ్గిన కేసులు
India corona bulletin on September 25th.భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల
By తోట వంశీ కుమార్ Published on 25 Sep 2021 4:54 AM GMT
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 15,92,421 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 29,616 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కి చేరింది. నిన్న ఒక్క రోజే 290 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,46,658కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) September 25, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/bqZl8ckPPo pic.twitter.com/ly6YIqs7Vf
నిన్న 28,046 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,28,76,319కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,01,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.78శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.99శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.86 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 71 లక్షల మందికి మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 84.89 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.