భారత్లో కరోనా అప్డేట్.. స్వల్పంగా తగ్గిన కేసులు
India corona bulletin on September 24th.దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల
By తోట వంశీ కుమార్ Published on
24 Sep 2021 4:42 AM GMT

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 15,65,696 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 31,382 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కి చేరింది. నిన్న ఒక్క రోజే 318 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,46,368కి చేరింది.
నిన్న 32,542 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,28,48,273కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,00,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.78శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.00 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 72,20,642 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 84,15,18,026 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
Next Story