భారత్ కరోనా అప్డేట్.. తగ్గుతున్న కేసులు
India Corona bulletin on September 22nd.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,92,395
By తోట వంశీ కుమార్ Published on
22 Sep 2021 4:58 AM GMT

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,92,395 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 26,964 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. నిన్న ఒక్క రోజే 383 మంది మృతిచెందారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,45,768కి చేరింది.
నిన్న 34,167 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,27,83,741కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.77శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.08శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 75,57,529 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 82,65,15,754 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
Next Story