భారత్ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
India corona bulletin on September 21st.భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 14,13,951
By తోట వంశీ కుమార్ Published on 21 Sep 2021 4:47 AM GMT
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 14,13,951 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 26,115 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534కి చేరింది. నిన్న ఒక్క రోజే 252 మంది మృతిచెందారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,45,385కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) September 21, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/EAnEd2JZev pic.twitter.com/c6rF6BafXx
నిన్న 34,469 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,27,49,574కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,09,575 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.75శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.08శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.85 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 96,46,778 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 81,85,13,827 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.