భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

India Corona Bulletin on September 1st.దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న కాస్త త‌గ్గిన కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2021 4:56 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న కాస్త త‌గ్గిన కేసుల సంఖ్య నేడు పెరిగాయి. గ‌డిచిన 24 గంటల్లో 16,06,785 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 41,965 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,28,10,845కి చేరింది. నిన్న ఒక్క రోజే 460 మంది మృతి చెందారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,39,020కి చేరింది.

24 గంట‌ల వ్య‌వ‌ధిలో 33,964 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,19,93,644కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 3,78,181 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.51శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.58శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 1,33,18,718 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 65,41,13,508 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story