భారత్ కరోనా అప్డేట్.. స్వల్పంగా తగ్గిన కేసులు
India corona bulletin on September 19th.భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు
By తోట వంశీ కుమార్ Published on
19 Sep 2021 4:46 AM GMT

భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 15,59,895 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 30,773 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,48,163కి చేరింది. నిన్న ఒక్క రోజే 309 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,44,838కి చేరింది.
నిన్న 38,945 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,26,71,167కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,32,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.68శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.04శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.97 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 85,42,732 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 80,43,72,331 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
Next Story