భారత్ కరోనా అప్డేట్.. తగ్గుముఖం పట్టిన కేసులు
India Corona bulletin on September 14th.భారత్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. వరుసగా మూడో రోజు కూడా
By తోట వంశీ కుమార్ Published on 14 Sep 2021 4:41 AM GMT
భారత్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. వరుసగా మూడో రోజు కూడా కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,30,891 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 25,404 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579కి చేరింది. నిన్న ఒక్క రోజే 339 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,43,213కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) September 14, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/X4pKHGPEfl pic.twitter.com/nksvlB1QWo
నిన్న 37,127 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,24,84,159కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,62,207 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.58శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.78 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 78,66,950 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 75,22,38,324 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.