భారత్ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
India Corona Bulletin on September 13th.దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 12,08,247 కరోనా
By తోట వంశీ కుమార్ Published on
13 Sep 2021 5:11 AM GMT

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 12,08,247 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 27,254 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175కి చేరింది. నిన్న ఒక్క రోజే 219 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,42,874కి చేరింది.
నిన్న 37,687 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,24,47,032కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,74,269 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.54శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.11శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.26 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 53,38,945 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 74,38,37,643 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story