భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

India Corona bulletin on October 7th.భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌, మొన్న త‌గ్గిన‌ట్లుగా క‌నిపించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2021 4:46 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌, మొన్న త‌గ్గిన‌ట్లుగా క‌నిపించిన కేసులు తాజాగా మ‌ళ్లీ పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 14,31,819 మంది క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 22,431 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,38,94,312 చేరింది. నిన్న ఒక్క రోజే 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 4,49,856 కి చేరింది.

నిన్న 24,602 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,32,00,258 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 2,44,198 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 204 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 97.95 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 43,09,525 మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 92,63,68,608 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.

Next Story