భారత్ కరోనా అప్డేట్.. స్వల్పంగా తగ్గిన కేసులు
India corona bulletin on October 2nd.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,29,258 కరోనా
By తోట వంశీ కుమార్ Published on
2 Oct 2021 4:40 AM GMT

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,29,258 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 24,354 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,37,91,061 చేరింది. నిన్న ఒక్క రోజే 234 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,48,573కి చేరింది.
నిన్న 25,455 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,30,68,599 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,73,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.86 శాతానికి చేరింది. నిన్న ఒక్క రోజే 69.33లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటి వరకు 89.74కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.
Next Story