భార‌త్ క‌రోనా అప్‌డేట్.. భారీగా పెరిగిన మ‌ర‌ణాలు

India corona bulletin on October 23rd.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2021 4:43 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్.. భారీగా పెరిగిన మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే కేసుల సంఖ్య త‌గ్గిన‌ప్ప‌టికి మ‌ర‌ణాల సంఖ్య పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 13,64,681 మంది క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 16,326 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,41,59,653కి చేరింది. నిన్న ఒక్క రోజే 666 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,53,708కి చేరింది. నిన్న 17,677 మంది కోలుకున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,35,32,126కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,73,728 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.16 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 68,48,417 మందికి క‌రోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,01,30,28,411 టీకా డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story