భారత్ కరోనా అప్డేట్.. భారీగా తగ్గిన కేసులు
India Corona bulletin on October 22nd.భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు
By తోట వంశీ కుమార్ Published on
22 Oct 2021 4:43 AM GMT

భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 14శాతం మేర తగ్గింది. గడిచిన 24 గంటల్లో 13,24,263 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 18,641 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,41,43,327కి చేరింది. నిన్న ఒక్క రోజే 231 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,53,042కి చేరింది. నిన్న 18,641మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య3,35,14,449కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,75,745 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.16 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 61,27,277 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటి వరకు 100.59 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు.
Next Story