భారత్ కరోనా అప్డేట్.. స్వల్పంగా పెరిగిన కేసులు
India Corona bulletin on October 1st.దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,20,899 కరోనా
By తోట వంశీ కుమార్ Published on
1 Oct 2021 4:38 AM GMT

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,20,899 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 26,727 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,37,66,707 చేరింది. నిన్న ఒక్క రోజే 277 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,48,339కి చేరింది.
నిన్న 28,246 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,30,43,144 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,75,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.86 శాతానికి చేరింది. నిన్న ఒక్క రోజే 64,40,451 మందికి మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు 89,02,08,007 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.
Next Story