భారత్ కరోనా అప్డేట్.. స్వల్పంగా పెరిగిన కేసులు
India corona bulletin on October 13th.భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,25,399 మంది
By తోట వంశీ కుమార్ Published on 13 Oct 2021 4:35 AM GMT
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,25,399 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 15,823 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది. నిన్న ఒక్క రోజే 226 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,51,189 కి చేరింది. నిన్న 22,844 మంది కోలుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) October 13, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/UqhVoPvxY9 pic.twitter.com/oXdIx3SZTz
ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,33,42,901 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,07,653 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 214 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 98.06 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 50,63,845 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 96,43,79,212 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.