భార‌త్ క‌రోనా అప్‌డేట్.. పెరిగిన కేసులు

India corona bulletin on November 4th.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 6:34 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్.. పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 10,67,914 మందికి క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 12,885 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,43,21,025కి చేరింది. నిన్న ఒక్క రోజే 461 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,59,652కి చేరింది.

నిన్న 15,054మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,37,12,794కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,48,579 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.23 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 30,90,920 మందికి క‌రోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,07,63,14,440 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.

Next Story