భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 70శాతం కేసులు ఒక్క కేర‌ళ‌లోనే

India Corona Bulletin on August 30th.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 14,19,900 క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2021 4:48 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 70శాతం కేసులు ఒక్క కేర‌ళ‌లోనే

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 14,19,900 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 42,909 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు సోమ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో దాదాపు 70 శాతం కేసులు ఒక్క కేర‌ళ రాష్ట్రంలోనే నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే కేర‌ళలో 29,836 కేసులు న‌మోదు అయ్యాయి. కాగా.. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు పాజిటివ్‌ కేసుల సంఖ్య‌ 3,27,37,939కి చేరింది. నిన్న ఒక్క రోజే 380 మంది మృతి చెందారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,38,210కి చేరింది.

24 గంట‌ల వ్య‌వ‌ధిలో 34,763 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,19,23,405కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 3,76,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.51శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.41శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క‌రోజే 31,14,696 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 63.43 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story