భారత్ కరోనా అప్డేట్.. పెరుగుతున్న కేసులు
India corona Bulletin on August 28th.భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల
By తోట వంశీ కుమార్
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడు 12 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 17,61,110 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 46,759 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కి చేరింది. నిన్న ఒక్క రోజే 509 మంది మృతి చెందారు.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) August 28, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/SwR8AGhrta pic.twitter.com/WGueenuous
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,37,370కి చేరింది. 24 గంటల వ్యవధిలో 31,374 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,18,51,802కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,59,775 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.56శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.19 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.66 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న రికార్డు స్థాయిలో 1,03,35,290 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 62,29,89,134 టీకా డోసులు పంపిణీ అయ్యాయి.