దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్రం బిగ్ డెసిషన్
ప్రైవేట్ రిఫైనరీల విపరీతమైన లాభాలకు అడ్డుకట్ట వేస్తూ, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
By - అంజి |
దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్రం బిగ్ డెసిషన్
ప్రైవేట్ రిఫైనరీల విపరీతమైన లాభాలకు అడ్డుకట్ట వేస్తూ, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచుతూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సుంకాల పెంపు వివరాలు:
డీజిల్: లీటరుపై ఎగుమతి సుంకాన్ని రూ. 21.50 నుండి రూ. 55.50కి పెంచారు.
విమాన ఇంధనం (ATF): లీటరుపై సుంకాన్ని రూ. 29.50 నుండి రూ. 42కి పెంచారు.
నిర్ణయానికి కారణం:
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రైవేట్ రిఫైనరీ సంస్థలు దేశీయ మార్కెట్లో ఇంధనాన్ని విక్రయించడం కంటే విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను (Windfall Gains) గడిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన IOC, BPCL, HPCL దేశీయంగా ధరలను స్థిరీకరించినప్పటికీ, ప్రైవేట్ సంస్థలు మాత్రం లాభాల కోసమే మొగ్గు చూపుతున్నాయి. దేశీయంగా డీజిల్ కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రైవేట్ సంస్థల వ్యూహం:
దేశీయ మార్కెట్లో అమ్మకాలు నష్టదాయకంగా ఉండటంతో ప్రైవేట్ రిటైలర్లు వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. కొందరు లీటరుపై రూ. 3-5 పెంచి వినియోగదారులను తగ్గించుకుంటుంటే, మరికొందరు రోజుకు కొంత మొత్తంలోనే డీజిల్ విక్రయిస్తూ రేషనింగ్ విధిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్పై రూ. 24.40, డీజిల్పై రూ. 104.99 నష్టపోతున్నాయి.
విమాన ఇంధన ధరల సర్దుబాటు:
మొదట ఏప్రిల్ 1న విమాన ఇంధన ధరలను దేశీయ విమానయాన సంస్థలకు 114%, విదేశీ సంస్థలకు 107% మేర భారీగా పెంచారు. అయితే, దీనివల్ల విమాన టికెట్ల ధరలు సామాన్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో, అదే రోజు సాయంత్రం ఆ నిర్ణయాన్ని సమీక్షించారు. దేశీయ రూట్లలో నడిచే ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలకు ATF ధరను లీటరుకు రూ. 1,04,927 వద్ద స్థిరీకరిస్తూ ప్రభుత్వం ఊరటనిచ్చింది.