Video: బాలికను గొలుసుతో కట్టేసి కొట్టిన రిటైర్డ్‌ ఆర్మీ అధికారి.. జామ పండ్లు కోసిందని..

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం జామ పండ్లు కోసిందన్న నెపంతో ఒక చిన్నారిని...

By -  అంజి
Published on : 6 April 2026 7:44 AM IST

Himachal Pradesh, Una District, Child Abuse, Retired Army Personnel, Minor Girl Assaulted, Social Media Viral Video, Child Helpline, Police Investigation, Human Rights Violation

Video: బాలికను గొలుసుతో కట్టేసి కొట్టిన రిటైర్డ్‌ ఆర్మీ అధికారి.. జామ పండ్లు కోసిందని..

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం జామ పండ్లు కోసిందన్న నెపంతో ఒక చిన్నారిని రిటైర్డ్ ఆర్మీ అధికారి గొలుసులతో కట్టివేసి, చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత బాలిక ఒక వలస కూలీల కుటుంబానికి చెందినది. నిందితుడి ఇంటి బయట ఉన్న చెట్టు నుండి కొన్ని జామ పండ్లను కోయడమే ఆ చిన్నారి చేసిన "నేరం". దీనికి ఆగ్రహించిన ఆ రిటైర్డ్ ఆర్మీ అధికారి, బాలికను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి, మెట్ల దగ్గర ఉన్న గొలుసులతో కట్టివేసి దాడికి పాల్పడ్డాడు.

మెరైన్ ఇంజనీరింగ్‌లో పనిచేస్తున్న రోహిత్ అనే యువకుడు ఈ ఘోరాన్ని గమనించి తన ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియోలో చిన్నారి భయంతో ఏడుస్తూ తనను కాపాడమని వేడుకోవడం కనిపిస్తుంది. నిందితుడు మాత్రం ఆమె జామ పండ్లు దొంగిలించిందని తన చర్యను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. రోహిత్ వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ మరియు పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత నిందితుడు బాలిక కుటుంబానికి క్షమాపణలు చెప్పినప్పటికీ, చట్టపరమైన చర్యలు తప్పలేదు.

ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా స్పందించి కేసు నమోదు చేశారు. రిటైర్డ్ ఆర్మీ అధికారిని విచారించి, బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. పసిపిల్లలపై ఇటువంటి అమానవీయ దాడులు చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Next Story