తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలంటూ.. కోర్టులో పిటిషన్‌

తాజ్ మహల్‌ను తేజో మహాలయ, హిందూ దేవాలయంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది.

By అంజి  Published on  28 March 2024 4:26 AM GMT
Agra court, Taj Mahal, Shiva temple, Tejo Mahalaya

తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలంటూ.. కోర్టులో పిటిషన్‌

తాజ్ మహల్‌ను తేజో మహాలయ, హిందూ దేవాలయంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో.. అన్ని తాజ్‌ మహల్‌లో ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని, ప్రార్థనా స్థలానికి అనువైన ఇతర పద్ధతులను నిలిపివేయాలని కోరింది. ఈ పిటిషన్‌ ఏప్రిల్ 9న విచారణకు రానుంది.

శ్రీ భగవాన్ శ్రీ తేజో మహాదేవ్ పోషకుడిగా, యోగేశ్వర్ శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ దావా వేశారు. తాజ్‌మహల్‌గా గుర్తించబడక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందని పిటిషనర్ తన వాదనకు మద్దతుగా వివిధ చారిత్రక పుస్తకాలను ఉదహరించారు. తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.

ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా కూడా తాజ్‌మహల్‌ను "పురాతన శివాలయం"గా పేర్కొంటూ హిందూ పూజలు నిర్వహించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. 'యోగి యూత్ బ్రిగేడ్' పిటిషన్ దాఖలు చేసింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజ్‌మహల్‌కు గంగాజలంతోపాటు జలాభిషేకం కూడా అందించాలని పిటిషన్‌లో కోరారు. తాజ్ మహల్ నిజానికి "శివాలయం, దీని పేరు తేజో మహాలయ శివాలయం" అని పిటిషనర్లు పేర్కొన్నారు.

కావున మహాశివరాత్రి నాడు తాజ్‌మహల్‌లో జలాభిషేకం చేసేందుకు ఏఎస్‌ఐ అనుమతించాలని కోరారు. యోగి యూత్ బ్రిగేడ్ తరపున న్యాయవాది శివ్ ఆధార్ సింగ్ తోమర్ మాట్లాడుతూ.. 1212 సంవత్సరంలో, పరమ దేవ్ ద్రవిదేవ్ రాజు ఆగ్రాలో తేజోమహాలయ తేజోమహల్ అని పిలువబడే శివాలయాన్ని నిర్మించాడు.

"ఇక్కడే తాజ్ మహల్ నిర్మాణం 1653లో పూర్తయింది. అయితే షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ 1652లోనే తన తండ్రికి లేఖ రాశాడు, భవనంలో పగుళ్లు వచ్చాయని, అది ఎప్పుడైనా పడిపోవచ్చని, మరమ్మతులు చేయాలని. దీంతో ఎక్కడో పాత చిహ్నాన్ని సవరించినట్లు కూడా స్పష్టమవుతోంది. ప్రధాన గోపురంపై కలశం హిందూ దేవాలయాల మాదిరిగా ఉంటుంది. నేటికీ హిందూ దేవాలయాలలో బంగారు కలశాన్ని ప్రతిష్టించే సంప్రదాయం ఉంది. కలశంపై చంద్రుడు ఉన్నాడు. దాని ప్రణాళిక కారణంగా, చంద్రుడు, కలశం యొక్క కొనలు కలిసి త్రిశూల ఆకారాన్ని ఏర్పరుస్తాయి, ఇది శివుని చిహ్నంగా ఉంది, ”అని తోమర్ చెప్పారు. తాజ్ మహల్ బయటి గోడలపై కలశ, త్రిశూల్, తామర, కొబ్బరి, మామిడి ఆకుల చిహ్నాలు "హిందూ దేవాలయాలకు చిహ్నాలు" అని చెక్కబడి ఉన్నాయని తోమర్ చెప్పారు.

Next Story