ఏనుగు దాడిలో రైతు మృతి.. 15 గంటల తర్వాత మృతదేహం వెలికితీత

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుర్గూర్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ ఏనుగు రైతును చంపింది.

By అంజి  Published on  22 May 2024 5:00 PM IST
Farmer killed, elephant, Tamil Nadu, Erode,

ఏనుగు దాడిలో రైతు మృతి.. 15 గంటల తర్వాత మృతదేహం వెలికితీత

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుర్గూర్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ ఏనుగు రైతును చంపింది. దాదాపు 15 గంటల తర్వాత అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోడ్ జిల్లా అటవీ పరిధిలోని బూర్గూర్ ఫారెస్ట్ రేంజ్‌లోని బెజ్జలట్టి అటవీ ప్రాంతానికి చెందిన మధన్ (48) తన పశువులను మేపేందుకు అడవిలోని పొన్నాచ్చియమ్మన్ ఆలయ ప్రాంతానికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దారితప్పిన ఏనుగు మధన్‌పై దాడి చేసి అక్కడికక్కడే తొక్కి చంపేసింది.

గ్రామస్తులు సాయంత్రం 6 గంటలకు అటవీ అధికారులకు, బూర్గుర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ ప్రాంతంలో వెలుతురు లేకపోవడంతో పోలీసులు, అటవీ సిబ్బంది ఇద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని మరణించిన మధన్ మృతదేహాన్ని వెలికితీయలేకపోయారు. బుధవారం ఉదయం అటవీశాఖ అధికారులతో కలిసి పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష నిమిత్తం అంతియూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బూర్గూర్ పోలీసులు ఏనుగు తొక్కి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story