ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించిన ఈసీ

ఉప రాష్ట్ర‌ప‌తి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా తర్వాత, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.

By Knakam Karthik
Published on : 23 July 2025 2:41 PM IST

Nationak News, Vice Presidential elections, Election Commission

ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించిన ఈసీ

ఉప రాష్ట్ర‌ప‌తి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా తర్వాత, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. అనారోగ్య కారణాలతో ఆయన సోమవారం రాత్రి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతిని లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యులందరూ కలిసి ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు అధికార పార్టీ ఎన్డీయేకు తగినంత మంది ఎంపీలున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి త్వరలో కొత్త ఉపరాష్ట్రపతి వ‌చ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాల్లో ఒక స్థానం, రాజ్యసభలోని 245 సీట్లలో 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీ ఎవరూ లేరు. అదే సమయంలో రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్‌లోని 4 సీట్లు, పంజాబ్‌లోని 1 సీటు ఖాళీగా ఉన్నాయి. ఉభయ సభల్లో మొత్తం ఎంపీల సంఖ్య 786 కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలుపొందే అభ్యర్థికి 394 ఓట్లు కావాలి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసన మండలి పాత్ర ఉండ‌దు.

అధికార పార్టీ ఎన్డీయే గురించి చెప్పాలంటే.. లోక్‌సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 129 మంది ఎంపీలు ఉన్నారు. ఉభ‌య స‌భ‌ల్లో ఎన్డీయేకు 422 మంది ఎంపీలు ఉన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గెలుపొందాలంటే 394 ఎంపీల ఓటింగ్ అవ‌స‌రం.. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ ఎంపీల ఓటింగ్ ద్వారానే ఎన్నిక సులభంగా జ‌ర‌గ‌నుంది.

Next Story