ఇక నుంచి 17 ఏళ్లకే ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు

Election Commission allows those above 17 yrs to apply in advance for voter IDs. సాధారణంగా మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం

By అంజి  Published on  28 July 2022 12:30 PM GMT
ఇక నుంచి 17 ఏళ్లకే ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు

మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పటి వరకు ఉండేది. అయితే దానిలో కొన్ని మార్పులు చేస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 17 ఏళ్ల వయస్సులోనే ఓటర్‌ కార్డును ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీఐ స్పష్టం చేసింది. ఏడాదిలో జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలనేది ప్రస్తుత నిబంధన. కానీ కొత్త నిబంధన ప్రకారం.. ముందస్తు దరఖాస్తులు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలలో కూడా అనుమతించబడతాయి.రిజిస్ట్రేషన్ తర్వాత, వ్యక్తికి ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ జారీ చేయబడుతుంది.

ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తమ ముందస్తు దరఖాస్తులను సమర్పించవచ్చు. 18 సంవత్సరాలు నిండిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకునే ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త తేదీలు ప్రకటించబడ్డాయి. కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లు 1 ఆగస్టు 2022 నుండి అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండేల నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.


Next Story