ముంచుకొస్తున్న 'యాస్‌'.. 59 రైళ్ల ర‌ద్దు

Cyclone yaas effect trains cancelled. యాస్‌ తుఫాన్‌ క్రమంగా బలపడుతుండటంతో రైల్వేశాఖ అప్ర‌మ‌త్తం అయ్యింది. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా 59 రైళ్లను తాత్కాలికంగా రద్దు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 May 2021 2:44 AM GMT
trains canceled

దక్షణ తీర రాష్ట్రాలకు తుఫాన్‌ ప్రమాదం పొంచి ఉంది. యాస్‌ తుఫాన్‌ క్రమంగా బలపడుతుండటంతో రైల్వేశాఖ అప్ర‌మ‌త్తం అయ్యింది. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా 59 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శనివారం రాత్రి వెల్ల‌డించింది. యాస్‌ తుఫాన్‌ ఈ నెల 26 వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు తూర్పు మధ్య బంగాళాఖాతం దాని వెంటే ఉత్తర అండమాన్ తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో దక్షిణ తీర రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ర‌ద్దైన రైళ్ల వివ‌రాలు ఇవే..

- హౌరా- హైద‌రాబాద్‌(08645), హైద‌రాబాద్‌-హౌరా(08646), హౌరా-సికింద్రాబాద్‌(02703) రైళ్లు ఈ నెల 25 నుంచి 27 వ‌ర‌కు నిలిచిపోనున్నాయి.

- సికింద్రాబాద్‌-హౌరా(02704) సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 24 నుంచి 26 వ‌ర‌కు ర‌ద్దు చేశారు

- భువ‌నేశ్వ‌ర్-సికింద్రాబాద్‌(07015) 26 నుంచి 28 వ‌ర‌కు

- సికింద్రాబాద్ - భువ‌నేశ్వ‌ర్‌(07016) 24 నుంచి 26 వ‌ర‌కు

- తిరుప‌తి- పూరి (07479) ఎక్స్‌ప్రెస్ 24 నుంచి 26 మ‌ధ్య‌

- తిరుప‌తి -పూరి(07480) 26 నుంచి 28 వ‌ర‌కు

- గౌహ‌తి-సికింద్రాబాద్‌(07029), సికింద్రామాద్‌-షాలిమార్‌(02774) 25న‌, షాలిమార్‌-సికింద్రాబాద్‌(02773) 26న ర‌ద్దు అయ్యాయి.

మిగిలిన వాటిలో ఎక్కువ రైళ్లు ఈ నెల 26న ఒక రోజు , మ‌రికొన్ని 27, 28, 29 తేదీల్లో ర‌ద్దు అయ్యాయి.


Next Story