జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ సహా నలుగురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం (జనవరి 27, 2026)నాడు ఘోర ప్రమాదం జరిగింది.

By -  అంజి
Published on : 27 Jan 2026 2:50 PM IST

CRPF jawan, four dead, road crash, Jammu and Kashmir, Udhampur

జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ సహా నలుగురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం (జనవరి 27, 2026)నాడు ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు ఆగి ఉన్న రోడ్డు క్యారియర్‌ను, మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒక CRPF జవాన్‌తో సహా నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జఖాని-చెనాని ప్రాంతం సమీపంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

దోడా నుండి జమ్మూకు వెళ్తున్న బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత లోడ్ క్యారియర్‌ను ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో లోడ్‌ క్యారియర్‌ టెక్నికల్‌ ఇష్యూ వల్ల రోడ్డు పక్కన ఆగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో మెకానిక్, లోడ్ క్యారియర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అత్యవసర కిటికీలోంచి బయటకు విసిరివేయబడి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని అధికారి తెలిపారు.

Next Story