ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది.

By Srikanth Gundamalla  Published on  6 April 2024 4:30 AM GMT
chhattisgarh, encounter, three maoist, death,

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత సంఘటనాస్థలంలో ఏకే-47 గన్, పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. అనంతరం.. ఘటనాస్థలంలో ఏకే-47 సహా మూడు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story