సోషల్‌మీడియాలో ఫేక్‌ న్యూస్‌ను అరికట్టేందుకు.. కొత్త ఐటీ రూల్స్‌

Centre releases amended IT rules for social media. సోషల్ మీడియా దేశంలోని చట్టాల ప్రకారం పనిచేయాలి. ఐటీ చట్టానికి సవరణలు చేయడం వల్ల ఫేక్ న్యూస్

By అంజి  Published on  30 Oct 2022 9:01 AM GMT
సోషల్‌మీడియాలో ఫేక్‌ న్యూస్‌ను అరికట్టేందుకు.. కొత్త ఐటీ రూల్స్‌

సోషల్ మీడియా దేశంలోని చట్టాల ప్రకారం పనిచేయాలి. ఐటీ చట్టానికి సవరణలు చేయడం వల్ల ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలో సవరణలు దోహదపడతాయని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ సహా సోషల్ మీడియా ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

దీనిపై మంత్రి స్పందిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారాన్ని నియంత్రించాలని దేశంలో లక్షలాది మంది ఆయా కంపెనీలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. డిజిటల్ పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకు సోషల్ మీడియా సంస్థలు కృషి చేయాలి. సోషల్ మీడియా కంపెనీలు దేశంలోని ఏ మూలలో ఉన్నా, అవి పనిచేసే దేశంలోని చట్టానికి కట్టుబడి ఉండాలి. భారతదేశంలోని అన్ని కంపెనీలు చట్టాన్ని గౌరవించాలి. దాని ప్రకారం పని చేయాలి. భారతీయుల రాజ్యాంగ హక్కులను కాలరాయలేమని అన్నారు.

తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి 72 గంటల సమయం: హింసను ప్రేరేపించే, మతం లేదా కులం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే ఏదైనా తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడితే, దానిని 72 గంటల్లోగా కంపెనీ తొలగించాలి. కాస్త నిడివి ఉన్నా.. నిర్ణీత గడువులోగా అలాంటి వాటిని తొలగించాలని అన్నారు. కంపెనీలకు జరిమానా విధించడంపై మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై ఆసక్తి చూపడం లేదన్నారు. దేశంలోని చట్టాలను అనుసరించే సంస్థలపై ఒత్తిడి లేదు. అది దాటితే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Next Story