ఘోర ప్రమాదం, డీజే ట్రాలీకి విద్యుత్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం
ఏకంగా 9 మంది కావడి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 8:00 AM IST
ఘోర ప్రమాదం, డీజే ట్రాలీకి విద్యుత్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం
బీహార్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటనలో ఏకంగా 9 మంది కావడి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. హాజీపూర్లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
సుల్తాన్పూర్ గ్రామంలో కావడి యాత్రికుల ట్రాలి వెళ్తుంది. ట్రాలీలో డీజే సౌండ్ పెట్టుకుని యాత్రికులు ముందుకు సాగుతున్నారు. సోన్పూర్లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అనుకోకుండా ట్రాలీ డీజీకు 11వేల వోల్ట్స్ విద్యుత్ తీగలు తగిలాయి. దాంతో.. ట్రాలీలో ఒక్కసారిగా విద్యుత్ పాస్ అయ్యింది. కావడి యాత్రికులంతా కరెంట్ షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు సంఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ సమాచారం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని చెప్పారు. సీరియస్గా ఉన్న వ్యక్తిని మరో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. ట్రాలీలో ప్రయాణిస్తున్న కావడియాత్రికులంతా పహెల్జా నుండి గంగాజలాన్ని తీసుకుని, సోన్పూర్లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళుతున్నారు.
#WATCH | Bihar: Sadar SDPO Hajipur Omprakash says, "The Kanvarias were going on a DJ. The DJ was very high and there was a wire in which it got entangled. This led to the death of eight people while some others were injured and are undergoing treatment...Further investigation is… pic.twitter.com/vAJIbEvBPJ
— ANI (@ANI) August 5, 2024