అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత

అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే బుధవారం మరణించారు.

By అంజి  Published on  12 Feb 2025 10:41 AM IST
Ayodhya Ram Temple, chief priest died, stroke, Acharya Satyendra Das

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత

అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే బుధవారం మరణించారు. ఆయనకు 85 ఏళ్లు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ మరణించారు. ఈ వార్తను ఆయన శిష్యుడు ప్రదీప్ దాస్ ధృవీకరించారు. ప్రదీప్ దాస్ ప్రకారం.. వృద్ధ పూజారి అంత్యక్రియలు గురువారం అయోధ్యలోని సరయు నది ఒడ్డున జరుగుతాయి. అతని మృతదేహాన్ని ప్రస్తుతం లక్నో నుండి పవిత్ర నగరానికి తీసుకెళ్తున్నారు.

ఆచార్య సత్యేంద్ర దాస్ ఆదివారం బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరారు. ఈరోజు ముందుగా ఒక ప్రకటనలో, ఆయన పరిస్థితి విషమంగా ఉందని SGPGI అధికారులు ప్రకటించారు. ప్రకటన ప్రకారం.. పూజారి మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారు. వృద్ధ పూజారి మరణం "కోలుకోలేని నష్టం" అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గత నెలలో, రామాలయ ప్రధాన పూజారిగా అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన ఆచార్య సత్యేంద్ర దాస్, రామ్ లల్లా విగ్రహం యొక్క ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక యొక్క మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వేడుకలను "చాలా అందంగా" అభివర్ణించారు.

Next Story