షాకింగ్‌.. ఆకలి అలమటతో పిల్లి మాంసం పీక్కుతున్న యువకుడు

కేరళ రాష్ట్రంలో షాకింగ్‌ సంఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు రోజుల తరబడి ఆహారం లేకపోవడంతో, ఆకల భాధతో పిల్లి పచ్చి మాంసాన్ని తింటూ కనిపించాడు.

By అంజి  Published on  5 Feb 2024 3:11 AM GMT
Assam youth,  hunger , cat, Kerala

షాకింగ్‌.. ఆకలితో అలమటతో పిల్లి మాంసం పీక్కుతున్న యువకుడు

కేరళ రాష్ట్రంలో షాకింగ్‌ సంఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు రోజుల తరబడి ఆహారం లేకపోవడంతో, ఆకల భాధతో పిల్లి పచ్చి మాంసాన్ని తింటూ కనిపించాడు. మలప్పురం జిల్లా కుట్టిప్పురం బస్టాండ్‌ సమీపంలో ఈ దిగ్భ్రాంతికర ఘటన కనిపించింది శనివారం సాయంత్రం రద్దీగా ఉండే బస్టాండ్‌ ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. 27 ఏళ్ల వ్యక్తి అస్సాంలోని ధుబ్రి జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు. బస్టాండ్ మెట్ల మార్గంలో కూర్చుని చనిపోయిన పిల్లి పచ్చి మాంసాన్ని తింటున్నట్లు స్థానికులు గుర్తించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

"సమాచారం అందుకున్న తరువాత మేము సంఘటన స్థలానికి వెళ్లాం. అతనిని విచారించినప్పుడు, అతను గత ఐదు రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోలేదని చెప్పాడు" అని అధికారి చెప్పారు. వారు తనకు కొంత ఆహారాన్ని అందించారు. ఎటువంటి సందేహం లేకుండా తాను దానిని అంగీకరించానని చెప్పాడు. అయితే కొంత సమయం తర్వాత ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వ్యక్తి యొక్క వాంగ్మూలాల ఆధారంగా, అతను ఈశాన్య రాష్ట్రంలో ఒక కళాశాల విద్యార్థి. అతని కుటుంబానికి తెలియజేయకుండా డిసెంబర్‌లో రైలులో కేరళకు చేరుకున్నాడు.

"అతను అతని మొబైల్ నంబర్‌ను మాకు ఇచ్చాడు. అతని సోదరుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. మేము అతనిని సంప్రదించాము. సమాచారం సరైనదని నిర్ధారించాము"అని అధికారి చెప్పారు. ప్రాథమిక వైద్య పరీక్షల తరువాత, వ్యక్తిని పొరుగున ఉన్న త్రిస్సూర్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. ఆ వ్యక్తికి ఎలాంటి శారీరక, మానసిక సమస్యలు లేవని, బంధువులు ఇక్కడికి రాగానే అతడిని అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Next Story