ఒవైసీ త్వరలో 'రామ నామ' జపం చేస్తారు: వీహెచ్‌పీ

అసదుద్దీన్ ఒవైసీని టార్గెట్ చేస్తూ.. విశ్వహిందూ పరిషత్ శనివారం హైదరాబాద్ ఎంపీ త్వరలో 'రామ్ నామ్' జపిస్తారని పేర్కొంది.

By అంజి  Published on  21 Jan 2024 4:04 AM GMT
Asaduddin Owaisi, Ram Naam, VHP

ఒవైసీ త్వరలో 'రామ నామ' జపం చేస్తారు: వీహెచ్‌పీ

బాబ్రీ మసీదుపై చేసిన వ్యాఖ్యపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని టార్గెట్ చేస్తూ.. విశ్వహిందూ పరిషత్ శనివారం హైదరాబాద్ ఎంపీ త్వరలో 'రామ్ నామ్' జపిస్తారని పేర్కొంది. అంతకుముందు శనివారం ఒవైసీ మాట్లాడుతూ.. బాబ్రీ మసీదును "చాలా క్రమపద్ధతిలో" ముస్లింల నుండి లాక్కున్నారు. 1992లో మసీదును కూల్చివేయకుంటే ముస్లింలు ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేవారు కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఒవైసీ వాఖ్యలపై వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ స్పందిస్తూ, “గత 500 ఏళ్లలో, మీ పూర్వీకుల నుండి ఎవరైనా అయోధ్యను సందర్శించారా?” అని ప్రశ్నించారు. ''ఒవైసీ యూకే నుండి ఒక న్యాయవాది, అతను మసీదును రక్షించడానికి కోర్టును ఎందుకు తరలించలేదు? కేవలం తన రాజకీయాలు చేస్తున్నాడు. త్వరలో వారు 'రామభక్తులు' అవుతారని, 'రామనామ్' జపం చేస్తారని ఈ ముస్లిం పార్టీ అర్థం చేసుకోవాలి'' అని అన్నారు.

రామమందిర శంకుస్థాపనకు ముందు కర్ణాటకలోని కలబురగిలో ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ.. బాబ్రీ మసీదులో 500 ఏళ్లుగా ముస్లింలు నమాజ్ చేశారని, కాంగ్రెస్‌కు చెందిన జీబీ పంత్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు మసీదులో విగ్రహాలు పెట్టారని.. నాయర్ కలెక్టర్ అని అన్నారు. ఆ సమయంలో అయోధ్యలో, అతను మసీదును మూసివేసి అక్కడ పూజలు చేయడం ప్రారంభించాడు, వీహెచ్‌పీ ఏర్పడినప్పుడు రామమందిరం లేదని అన్నారు. రామమందిరం గురించి మహాత్మా గాంధీ ఎప్పుడూ ఏమీ ప్రస్తావించలేదని కూడా ఆయన పేర్కొన్నారు.

అయోధ్యలోని రామమందిరపు 'ప్రాణ ప్రతిష్ట' (పవిత్రోత్సవం) జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేడుకకు ముందు ఆచారాలు జరుగుతున్నాయి. చివరి ఈవెంట్ కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Next Story