వారం రోజుల్లో మ‌రో కొత్త వ్యాక్సిన్‌

One More New covid vaccine in a week. క‌రోనా చికిత్సలో అత్య‌వ‌స‌ర వినియోగానికి త‌యారు చేసిన 2 డీజీ(2 డీఆక్సీ-డీ-గ్లూకోజ్) ఔష‌దం మ‌రో వారం రోజుల్లో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని డీఆర్ డీవో చైర్మ‌న్ స‌తీశ్ రెడ్డి తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 1:01 PM GMT
new covid vaccine

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న త‌రుణంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శుభ‌వార్త చెప్పింది. క‌రోనా చికిత్సలో అత్య‌వ‌స‌ర వినియోగానికి త‌యారు చేసిన 2 డీజీ(2 డీఆక్సీ-డీ-గ్లూకోజ్) ఔష‌దం మ‌రో వారం రోజుల్లో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని డీఆర్ డీవో చైర్మ‌న్ స‌తీశ్ రెడ్డి తెలిపారు. 2-డీజీ ఔషధ ప్రయోగాలు, తయారీకి అయ్యే ఖర్చును ఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీసే భరించాయని.. ఈ పౌడర్ ధరను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ మందును కేవలం నీటిలో కలుపుకొని తాగితే సరిపోతుందని పేర్కొన్నారు. రెడ్డీస్ ల్యాబ్స్ నుంచే ఔష‌దం ఉత్ప‌త్తి అవుతుంద‌న్నారు. ఈ ఔష‌దం ద్వారా రోగులు త్వ‌ర‌గా కోలుకోవ‌డంతో పాటు చికిత్స వ్య‌యం త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేస్తున్నామ‌న్నారు.

ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌ను తీరుస్తుందా..?

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా చికిత్స కోసం ఔషధాన్ని తీసుకువచ్చింది. దీని పేరు 2 డీఆక్సీ డి గ్లూకోజ్... సంక్షిప్తంగా '2-డీజీ' అంటారు. 2-డీజీ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. ఈ ఔషధాన్ని డీఆర్డీవోకు చెందిన ఓ ప్రయోగశాల, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ఔషధాన్ని వాడిన కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ లో తెలిసొచ్చింది. 2-డీజీ ఔషధాన్ని తీసుకున్న రోగులకు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరం రాలేదని.. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలామందికి స్వల్పకాలంలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తోందని డీఆర్డీవో తెలిపింది. వైరస్ పెరుగుదలను ఇది కట్టడి చేస్తోందని తెలిపింది.

2-డీజీ ముందుకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇవ్వడం విశేషం. ల్యాబ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలయ్డ్ సైన్స్ , హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయరీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా ఈ ఔషధంపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఔషధం తీసుకున్న తర్వాత కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నారని.. అంతేకాదు మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తోందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారతదేశంలో ఆక్సిజన్ కోసం ఎంతగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అందరూ చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి '2-డీజీ' ఎంతో కొంత తోడ్పాటును అందిస్తుందని భావిస్తున్నారు.




Next Story