కొడుకు భార్యను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ.. ఆ కారణంతోనే..

A 70-year-old man is married to a 28-year-old daughter-in-law in Gorakhpur. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లా బదల్‌గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

By అంజి  Published on  26 Jan 2023 12:32 PM GMT
కొడుకు భార్యను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ.. ఆ కారణంతోనే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లా బదల్‌గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీరిద్దరూ స్థానిక దేవాలయంలో ఒకరి మెడలో మరొకరు దండలు వేసుకుని దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని తరువాత మామ, కోడలు మధ్య బంధం గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకున్న వ్యక్తి బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మెన్. కోడలుతో ఏడు ప్రదక్షిణలు చేసి ఆమెను భార్యగా చేసుకున్నాడు.

స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన కైలాష్ యాదవ్ వయస్సు 70 సంవత్సరాలు. చనిపోయిన తన కుమారుడి భార్య పూజను దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. పూజ వయసు 28 ఏళ్లు. కైలాష్ భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. అదే సమయంలో అతని మూడవ కుమారుడు కూడా కొన్నేళ్ల క్రితం మరణించాడు. భర్త మరణానంతరం కైలాష్ నలుగురు సంతానంలో మూడో కుమారుడి భార్య అయిన పూజ ఒంటరిగానే ఉంటోంది. అయితే పూజకు కొత్త జీవితం ఇవ్వాలనుకున్నాడో.. ఏమో ఆమెను ఓ గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లికి పూజ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది.

వయస్సు, సమాజంతో సంబంధం లేకుండా గుడికి వెళ్లి ఒకరితో ఒకరు ఏడు ప్రదక్షిణలు చేశారు. గుడిలో కోడలుతో వృద్ధుడి పెళ్లి చేసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫొటో వైరల్‌గా మారడంతో పెళ్లి ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పెళ్లయిన తర్వాత ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత వారికి స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ వారు ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఈ వ‌య‌సులో మామ తన కోడ‌లిని చేసుకోవడాన్ని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ పెళ్లిని సమర్థించే వారి సంఖ్య గ్రామంలో తక్కువ.

కోడలికి వేరొకరితో పెళ్లి చేసి ఉండాల్సిందని గ్రామంలో చర్చ జరుగుతోంది. అయితే ఇద్దరి అంగీకారంతోనే ఇది పెళ్లి వరకు వెళ్లిందని అభిప్రాయపడుతున్నారు.

Next Story