డేంజర్ టైమ్.. పొంచి ఉన్న ఉగ్ర ముప్పు

పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఎన్నో క్యాంపులు ఉన్నాయి. ఇప్పటికే భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసం చేసింది.

By -  అంజి
Published on : 2 Dec 2025 1:06 PM IST

69 active launch pads across LoC, 120 militants, infiltrate Kashmir, BSF IG Ashok Yadav

డేంజర్ టైమ్.. పొంచి ఉన్న ఉగ్ర ముప్పు  

పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఎన్నో క్యాంపులు ఉన్నాయి. ఇప్పటికే భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. ఇంకా అక్కడ ఉగ్రస్థావరాలు మిగిలే ఉన్నాయని, ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఐజీ అశోక్ యాదవ్ వెల్లడించారు.

నియంత్రణ రేఖకు ఆవలివైపు ప్రస్తుతం 69 ఉగ్రస్థావరాలు యాక్టివ్ గా ఉన్నాయని, ఈ క్యాంపుల్లో సుమారు 100 నుంచి 120 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. భారత్ లోకి చొరబడేందుకు అవకాశం కోసం చూస్తున్నారని, ఈ ఉగ్రవాదుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు. ఇక ఇటీవల చొరబాటుకు నాలుగుసార్లు ప్రయత్నించిన ఎనిమిది మంది ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ మట్టుబెట్టిందన్నారు.

Next Story