లూథియానాలో గ్యాస్‌ లీక్‌.. ఆరుగురు మృతి, 10 మందికి అస్వస్థత

పంజాబ్‌లోని లూథియానాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గయాస్‌పురా ప్రాంతంలో గ్యాస్ లీకేజీ సంఘటన

By అంజి  Published on  30 April 2023 5:15 AM GMT
Ludhiana, Punjab , gas leak

లూథియానాలో గ్యాస్‌ లీక్‌.. ఆరుగురు మృతి, 10 మందికి అస్వస్థత

పంజాబ్‌లోని లూథియానాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గయాస్‌పురా ప్రాంతంలో గ్యాస్ లీకేజీ సంఘటన కారణంగా ఆరుగురు మరణించారు. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. మరో 10 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలో ఉదయం 7.15 గంటలకు చోటుచేసుకుంది. లీకైన గ్యాస్‌ సంఘనా స్థలం నుంచి 300 మీటర్ల మేర వ్యాపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీల్ చేశారు. వారు ముఖానికి మాస్క్‌లు ధరించారు. అగ్నిమాపక అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

"లీక్ కారణంగా ఆరుగురు మరణించారు. అనేకమంది శ్వాస సంబంధిత సమస్యల గురించి ఫిర్యాదు చేసారు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. మొత్తం ప్రాంతాన్ని సీల్ చేశామని, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న దాదాపు 10 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. గ్యాస్ బాధితులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది, వారిలో కొందరు ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ఇళ్లను కూడా దూర ప్రాంతాలకు వెళ్లారు. గ్యాస్ ఎలా లీకైంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story