ప్రభుత్వ వైఖరిపై నారా లోకేష్ ఫైర్

By రాణి  Published on  5 April 2020 6:38 AM GMT
ప్రభుత్వ వైఖరిపై నారా లోకేష్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ కు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదంటూ ట్వీట్ల వర్షం కురిపించారు.

'' @ysjagan గారు మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు,మా ఇంటికొస్తే ఎం తెస్తారు అనే రకం. ఆయనకు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు,రైతులు, డాక్టర్లు,ఉద్యోగస్తులు పై లేకపోవడం బాధాకరం. గత ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారు. మరి కాంట్రాక్టర్ల పై కురిపించిన 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా ? కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చారు. సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్ని రాష్ట్రాల్లో ఐదు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారు.'' అంటూ నారా లోకేష్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ ఆపన్న హస్తం ముందుకు రాలేదని ఆవేదన చెందారు.



Next Story