తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్కు ఎంపీ శాలువాతో సత్కరించి శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఈ రోజు రాత్రి శ్రీకృష్ణ అతిథి గృహంలో కేటీఆర్ బస చేయనున్నారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

