కరోనా ఎఫెక్ట్‌: ఆ ఒక్క రోజు బస్సులు బంద్‌

By సుభాష్  Published on  20 March 2020 9:31 AM GMT
కరోనా ఎఫెక్ట్‌: ఆ ఒక్క రోజు బస్సులు బంద్‌

కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి 10వేల వరకు మృత్యువాత పడ్డారు. 2లక్షలకుపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తమై పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ అన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ దేశాలు మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది.

ఇక తాజాగా మేఘాలయా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక్కరోజు పూర్తిగా ప్రజా రవాణాపై ఆంక్షలు విధించాలని వెల్లడించింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి మార్చి 21 అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది. దాంతోపాటు దుకాణాలు, మార్కెట్లు సైతం మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 209 కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు.

Next Story