మధ్య ప్రదేశ్ లో తొలి కరోనా మరణం

By రాణి
Published on : 25 March 2020 7:56 PM IST

మధ్య ప్రదేశ్ లో తొలి కరోనా మరణం

ప్రపంచ దేశాలతో పాటు భారత్ లో కూడా కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రరూపాన్ని దాల్చుతోంది. బుధవారం ఉదయం తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదవ్వగా..సాయంత్రానికి మధ్యప్రదేశ్ లో మరో కరోనా మరణం నమోదైంది. ఉజ్జయినికి చెందిన 65 ఏళ్ల మహిళకు ఇటీవలే కరోనా నిర్థారణవ్వగా.. ఇండోర్ లోని ప్రభుత్వ ఆస్పత్రి అయిన MY హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటోంది.

Also Read : మెదడుకు పని చెప్పండి..రివార్డు గెలుచుకోండి..

మధ్యప్రదేశ్ లో మొత్తం 14 కరోనా కేసులు నమోదవ్వగా..బుధవారం మహిళ మృతితో తొలికరోనా మరణం నమోదైంది. ఈమె మృతితో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 12కు చేరింది. బుధవారం సాయంత్రానికి ఇండియాలో 606 కరోనా కేసులు నమోదవ్వగా..43మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Also Read : ఏటీఎంకు వెళ్ల‌కుండా ఇంటికే న‌గ‌దు.. కావాలంటే ఇలా..

Next Story