మిస్టరీ: మనుషులు ఉండని ఊరు.. ఎందుకో తెలిస్తే వణికిపోతారు.!

ఆ ఊరిలో పాడుబడిన కట్టడాలే తప్ప మనిషి జాడ కనిపించదు. ఆ ఊరి పేరే కుల్‌ధారా. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో ఉన్న ఈ ఊరిలో మనుషులు

By అంజి  Published on  7 May 2023 8:45 AM GMT
Kuldhara village, Rajasthan, kuldhara village history, ghost village

మిస్టరీ: మనుషులు ఉండని ఊరు.. ఎందుకో తెలిస్తే వణికిపోతారు.!

సాధారణంగా ఊరు అంటే.. మనుషులు ఉంటారు. అయితే ఆ ఊరిలో మాత్రం మనుషులు ఉండరు. అవును మీరూ వింటుంది.. నిజమే. ఆ ఊరిలో పాడుబడిన కట్టడాలే తప్ప మనిషి జాడ కనిపించదు. ఆ ఊరి పేరే కుల్‌ధారా. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో ఉన్న ఈ ఊరిలో మనుషులు లేకపోగా.. ప్రేతాత్మలు ఉన్నాయనే వదంతులు ఉన్నాయి. 13వ శతాబ్దం నాటికి ఈ ఊరిలో పాలీవాల్‌ బ్రహ్మణులు ఉండేవారు. 19వ శతాబ్దం ప్రారంభంలో ఆ ఊరిలోని మనుషులంతా.. వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే.. కొన్ని రోజులకే మొత్తం ఊరు ఖాళీ అయ్యింది. అయితే ఊరి జనాలు ఖాళీ చేసి వెళ్లిపోవడానికి దారితీసిన కారణాలపై స్పష్టమైన సమాచారం ఇప్పటి వరకు లేదు. ఆ ఊరిని మనుషులు విడిచి పెట్టడానికి గల కారణంపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.

అప్పటి జైసల్మేర్‌ మంత్రి సలీం సింగ్‌.. కుల్‌ధారాలో అరాచాకాలకు పాల్పడేవాడని, అతడి ఆకృత్యాలను భరించలేకనే జనాలు ఆ ఊరు ఖాళీచేసి వెళ్లిపోయారని చుట్టు పక్కల గ్రామాల వారు చెబుతుంటారు. ఊరు నిర్మానుష్యంగా మారిన తర్వాత, ఆ ఊరిలో ప్రేతాత్మలు సంచరిస్తున్నాయనే వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం ఏ ప్రభుత్వం కూడా ఆ ఊరిని పట్టించుకోలేదు. చివరకు 2010లో రాజస్థాన్‌ ప్రభుత్వం కుల్‌ధారా గ్రామాన్ని టూరిస్ట్‌ ప్లేస్‌గా మార్చాలని నిర్ణయం తీసుకుంది. అయితే కుల్‌ధారాలో పెద్దగా మౌలిక వసతులు అభివృద్ధి చేయనప్పటికీ, అప్పడప్పుడు కొంత మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఊరి శిథిలాల మధ్య తిరుగుతూ ఫొటోలు దిగుతుంటారు.

Next Story